Telugu MCQ Quiz in मराठी - Objective Question with Answer for Telugu - मोफत PDF डाउनलोड करा

Last updated on Mar 8, 2025

पाईये Telugu उत्तरे आणि तपशीलवार उपायांसह एकाधिक निवड प्रश्न (MCQ क्विझ). हे मोफत डाउनलोड करा Telugu एमसीक्यू क्विझ पीडीएफ आणि बँकिंग, एसएससी, रेल्वे, यूपीएससी, स्टेट पीएससी यासारख्या तुमच्या आगामी परीक्षांची तयारी करा.

Latest Telugu MCQ Objective Questions

Top Telugu MCQ Objective Questions

Telugu Question 1:

'అష్టావధానం' అనే పదాన్ని విడదీసి, ఏ సంధి కార్యమో పేర్కొనండి?

  1. అషట్ + అవధానం - అత్వ సంధి

  2. అష్ట + అవధానం - అత్వ సంధి

  3. అష్ట + అవధానం – సవర్ణదీర్ఘ సంధి

  4. అష్ట + అవధానం – అకార సంధి

Answer (Detailed Solution Below)

Option 3 :

అష్ట + అవధానం – సవర్ణదీర్ఘ సంధి

Telugu Question 1 Detailed Solution

సరైన సమాధానం: “అష్ట + అవధానం సవర్ణదీర్ఘ సంధి

కీలక అంశాలు:

  • 'అష్టావధానం' అనే పదాన్ని విడదీయగా అష్ట + అవధానం – (అ + అ = ఆ) - ఇక్కడ పూర్వ పదం (అష్ట)లోని అచ్చునకు, ఉత్తరపదం(అవధానం)లోని అచ్చుపరమై దీర్ఘం వచ్చినది కావున ఇది సవర్ణదీర్ఘ సంధి.
  • అత్వసంధి: అకార సంధి - అత్తునకు సంధి బహుళం. బహుళమంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అనే నాలుగు కార్యాలు ఉంటాయి.
  • ఉదా: రామ + అయ్య = రామయ్య (నిత్యం); దూత + ఇతడు = దూతయితడు (యడాగమ రూపం); మేన + అల్లుడు = మేనల్లుడు (సంధి జరిగిన రూపం), మేనయల్లుడు (సంధి జరుగని యడాగమ రూపం); తామర + ఆకు = తామరపాకు, పుగాగమం అన్య విధంగా వచ్చి చేరింది.
  • సవర్ణదీర్ఘ సంధి-సూత్రం: ‘అ, ఇ, ఉ, ఋ’ లకు అవే అచ్చులు పరమగునపుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.
  • ఉదా: రామ+ఆలయం-రామాలయం
  • ఇచ్చిన ఎంపికలని గమనించగా 'అష్టావధానం' అనే పదాన్ని విడదీయగా ‘అష్ట + అవధానం సవర్ణదీర్ఘ సంధిఅనేది సరైన సమాధానం అవుతుంది అని మనం చూడవచ్చు.

Telugu Question 2:

'కేదారం' అనే పదానికి నానార్థాలు

  1. పొలం, శివక్షేత్రం, కొండ
  2. రాత్రి, పార్వతి, పాము, చీకటి
  3. రాత్రి, పసుపు
  4. భూమి, వెల, మావి, మెదడు 

Answer (Detailed Solution Below)

Option 1 : పొలం, శివక్షేత్రం, కొండ

Telugu Question 2 Detailed Solution

సరైన సమాధానం: పొలం, శివక్షేత్రం, కొండ

కీలక అంశాలు:

  • కేదారం(నామవాచకం)- కేదారం అనగా పొలం, పంటభూమి అనే అర్థం వస్తుంది.
  • ఎంపికల్లో ఉన్న పదాలను, వాటి అర్థాలను మనం గమనిద్దాం.
    • పొలం, శివక్షేత్రం, కొండ (నామవాచకాలు)-కేదారం అనే పదానికి నానార్థాలు.
    • రాత్రి, పార్వతి, పాము, చీకటి(నామవాచకాలు)-కంచుకీ అనే పదానికి నానార్థాలు.
    • రాత్రి, పసుపు(నామవాచకాలు)-యామినీ/రజనీ అనే పదానికి నానార్థాలు
    • భూమి, వెల, మావి, మెదడు(నామవాచకాలు)-అనేవి ధర అనే పదానికి నానార్థాలు.
  • పైన పేర్కొన్న పదాల అర్థాలను గమనించిన తర్వాత కేదారం అనే పదానికి నానార్థాలు పొలం, శివక్షేత్రం, కొండ సరైన సమాధానంగా  చెప్పవచ్చు.

అదనపు సమాచారం:

  • పదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని నానార్థాలు అని అంటారు. పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి.
  • ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.

Telugu Question 3:

శబ్ద పల్లవము అంటే

  1. ఒక శబ్దం పలుమార్లు రావడం
  2. రెండు వేర్వేరు అర్ధాలు కలిగిన పదాలు కలిసినప్పుడు కొత్త అర్ధాలు రావడం
  3. రెండు శబ్దాలు కలిసినప్పుడు ఒకటి లోపించడం
  4. ఒకే శబ్దం మరో అర్ధంలో వాడడం

Answer (Detailed Solution Below)

Option 2 : రెండు వేర్వేరు అర్ధాలు కలిగిన పదాలు కలిసినప్పుడు కొత్త అర్ధాలు రావడం

Telugu Question 3 Detailed Solution

సరైన సమాధానం: రెండు వేర్వేరు అర్ధాలు కలిగిన పదాలు కలిసినప్పుడు కొత్త అర్ధాలు రావడం

 కీలక అంశాలు

  • ధాతువు మొదలైన వాటికి ధాతువులు అనుప్రయుక్తంబులగునపుడు (వెంట ప్రయోగంప బడినపుడు) ఆ యా శబ్దముల కంటె విలక్షణమైన అర్థము బోధింపబడినపుడు ఆ పద బంధములకు శబ్దపల్లవములు అని పేరు.
  • అంటే ధాతువు లేదా ప్రాతిపదికకు ధాత్వీకరణ ప్రత్యయం చేరినపుడు ఏర్పడే విలక్షణార్థం గల ధాతువులనే శబ్ద పల్లవాలు అంటారు.
  • శబ్ద పల్లవములోరెండు  అవయవాలు ఉంటాయి.
    • మొదటిది ధాతువు కాని మరొకటి కాని కావచ్చును. రెండవ అవయవం తప్పనిసరిగ ధాతువు అయి ఉండాలి.
    • ఇప్పుడు ఈ రెండు అవయవాలు కలిసి మరో ధాతువుగ మారినపుడు ఆ క్రొత్త ధాతువుకు దానిలోని అవయవ శబ్దముల అర్థం కంటే వేరయిన అర్థం వస్తే దానిని శబ్ద పల్లవము అంటారు. 
  • పల్లవము అనగా చిగురు. రెండు దళములు ఏకీభవించి చిగురుగా రూపు దిద్దుకొన్నట్లు రెండు శబ్దములు కలిసి మరి యొక శబ్దముగ మారినచో అది శబ్ద పల్లవము అనబడును. వీటినే జంట శబ్ద క్రియలు అంటారు.
    • ఉదా: కూరుచు + ఉండు = కూరుచుండు

Telugu Question 4:

తమ్ముకుర్రలు - ఏ సమాసము?

  1. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
  2. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
  3. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
  4. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

Answer (Detailed Solution Below)

Option 3 : విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

Telugu Question 4 Detailed Solution

సరైన సమాధానం: “విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము

కీలక అంశాలు:

  • తమ్ముకుర్రలు - కుర్రలైన తమ్ములు(తామర పుష్పాలు). ఇందులో మొదటి (పూర్వ) పదం ‘తమ్ములు’ నామవాచకం, రెండో పదం(ఉత్తర పదం) ‘కుర్రలు’ విశేషణం. విశేషణమైన ‘కుర్రలు’ ఉత్తరపదం కావడం వల్ల ఈ సమాసం “విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము”.   
  • విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము సూత్రం: సమాసము నందలి పూర్వపదము విశేష్యముగాను(నామవాచకం), ఉత్తరపదము విశేషణము గాను ఉండును. ఉదా: పురుషోత్తముడు- ఉత్తముడైన పురుషుడు. 

Telugu Question 5:

ఈ క్రింది వానిలో 'నెయ్యము' అనే అర్థాన్నిచ్చే ఇంగ్లీష్ పదాన్ని గుర్తిచండి.

  1. happy
  2. fighting
  3. console
  4. friendship

Answer (Detailed Solution Below)

Option 4 : friendship

Telugu Question 5 Detailed Solution

సరైన సమాధానం: friendship

కీలక అంశాలు

ఎంపికల్లో ఉన్న అన్ని పదాలకు అర్థాన్ని చూద్దాం:

  • happy: ఆనంద౦
  • fighting: గొడవపడడం
  • console: ఓదార్చటం
  • friendship: స్నేహం, నెయ్యము, చెలిమి

నెయ్యము అనే పదం స్నేహం, చెలిమిని సూచిస్తుంది. అందుకే ఎంపిక 4 అంటే Friendship సరైన సమాధానం. 

Telugu Question 6:

తళుకుం గజ్జెలు - సంధి పేరు ఏమిటి.?

  1. నుగాగమ సంధి
  2. సరళాదేశ సంధి
  3. ఉత్త్వ సంధి
  4. ఆమ్రేడిత సంధి

Answer (Detailed Solution Below)

Option 1 : నుగాగమ సంధి

Telugu Question 6 Detailed Solution

సరైన సమాధానం: “నుగాగమ సంధి

కీలక అంశాలు:

  • తళుకుం గజ్జెలు – తళుకు + గజ్జెలు. ‘తళుకు గజ్జెలు’ అనే సంధి పదంలో ‘తళుకు’ అనే పదం ఉత్తు చివర గల స్త్రీ సమశబ్దం. ఇటువంటి ఉదంత స్త్రీ సమపదాలకు పరుషాలుగాని, సరళాలుగాని పరమైతే నుగాగమం వస్తుంది. తళుకు + న్  + గజ్జెలు - ద్రుతానికి సరళ స్థిరాలు పరమైతే పూర్ణబిందువు వస్తుంది. తళుకుం గజ్జెలు అవుతుంది. అలాగే పుంపులకు, పరుష సరళాలు పరమైతే నుగాగమం వస్తుంది.
  • ఎంపికల్లో ఉన్న పదాలను, వాటి అర్థాలను మనం గమనిద్దాం.
  • నుగాగమ సంధి సూత్రం 1:  ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చు పరమైనపుడు నుగాగమం వస్తుంది. ఉదా: చేయునతడు = చేయు + అతడు
  • నుగాగమ సంధి సూత్రం 2: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు-ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు. ఉదా: చిగురుం గయిదువు = చిగురు + కయిదువు
  • ద్రుతప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి: ద్రుతప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ఉదా: పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు.
  • ఉత్వ సంధి లేదా ఉకార సంధి-సూత్రం: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యమగును. ఉత్తు అనగా హ్రస్వమైన ఉకారం. ఉదా: రాముడు + అతడు – (డ్ + ఉ + అ = డ) - రాముడతడు. ఇక్కడ రాముడు అనే పూర్వపదంలోని చివరి అక్షరం(డు)లోని చివరి అచ్చు ‘ఉ’ లోపించి పరపదంలోని అచ్చు చేరుతుంది.
  • ఆమ్రేడిత సంధి సూత్రం: అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. ఉదా: ఔర + ఔర = ఔరౌర - (అ + ఔ = ఔ).
  • పైన పేర్కొన్న సంధులను గమనించిన తర్వాత “తళుకుం గజ్జెలు” అనేది “నుగాగమ సంధి”కి చెందినదిగా మనం చూడవచ్చు. 

Telugu Question 7:

'వాడు రేపు ఉదయం గుంటూరు వెళ్లవచ్చు'! ఇది ఏ రకమైన సామాన్య వాక్యం?

  1. సందేహార్థకం
  2. ఆత్మార్థకం
  3. సంభావనార్థకం
  4. విధ్యర్థకం

Answer (Detailed Solution Below)

Option 3 : సంభావనార్థకం

Telugu Question 7 Detailed Solution

సరైన సమాధానం:సంభావనార్థకం

కీలక అంశాలు:

  • ఎంపికల్లో ఉన్న పదాలను,వాటి అర్థాలను మనం గమనిద్దాం.
    • సందేహార్థకం: ఉదా: “రవి, పనిచేస్తాడో, చెయ్యడో? వాక్యంలో రవి పని చేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది కదా! ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.
    • ఆత్మార్థకం: పని చేసింది, ఆ కార్య ఫలితాన్ని అనుభవించింది ఒక్కరే. ఇక్కడ తనకోసమే తాను పని చేసినట్లు చెప్పడం ప్రధానం. క్రియా ధాతువు మీద ‘కొను’ ప్రత్యయం చేరుతుంది. ఉదా: మహాత్మాగాంధీని గురువుగా ఎంచుకున్నాడు.
    • సంభావనార్థకం: సంభావన అంటే ఊహ అని అర్థం. ఒక పని జరిగితే జరగవచ్చుననే ఊహాని సూచిస్తాయి. వాక్యంలో ధాతువునకు చివర 'వచ్చు' అనే ప్రత్యయం చేరుతుంది. ఉదా: సుమ రేపు అమెరికా వెళ్ళవచ్చు!
    • విధ్యర్థకం: ఆజ్ఞ మొదలైన అర్ధాలు వస్తాయి. విధులను, ఆజ్ఞలను తెలియజేయు క్రియారూపాలను విధ్యర్థకం అంటారు. ఇది మధ్యమ పురుషలో మాత్రమే ఉంటుంది. ఉదా: మీరు పాఠం చదవండి. క్రియలకి ఉదా: వెళ్ళు – వెళ్ళండి
  • పైన పేర్కొన్న పదాల అర్థాలను గమనించిన తర్వాత “వాడు రేపు ఉదయం గుంటూరు వెళ్లవచ్చు!” అనే వాక్యమునకు "సంభావనార్థకం" సరైన సమాధానం అని తెలుస్తుంది.

Telugu Question 8:

గుర్వాజ్ఞ అనేది ఏ సంధి గుర్తించండి 

  1. గుణ సంధి 
  2. వృద్ధి సంధి 
  3. యణాదేశ సంధి 
  4. యడాగమ త్రిక సంధి 

Answer (Detailed Solution Below)

Option 3 : యణాదేశ సంధి 

Telugu Question 8 Detailed Solution

సరైన సమాధానం : యణాదేశ సంధి 

కీలక అంశం : 

యణాదేశ సంధి : ఇ , ఉ , ఋ లకు అసమానమైన వర్ణాలు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
గుర్వాజ్ఞ  = గురు + అజ్ఞా

అదనపు సమాచారం  : 

గుణ సంధి : అకారానికి ఇ , ఉ , ఋ లు పరమైతే ఏ , ఓ అర్ లు ఏకాదేశంగా వస్తాయి. ఉదా: రాజ + ఋషి = రాజర్షి 

వృద్ధి సంధి : అకారానికి ఏ ఐ లు పరమైతే ఐ , ఓ ఔ లు పరమైతే ఔ ఏకాదేశమవుతాయి. ఉదా : దేశ + ఔన్నత్యం = దేశౌన్నత్యం 

యడాగమ త్రిక సంధి : యడాగమం వచ్చి తర్వాత త్రికం వస్తే దానిని యడాగమ త్రిక సంధి అంటారు . ఉదా : ఏ + ఎడ = ఎయ్యెడ 

ఉదాహరణ

అతి + అంత = అత్యంత 

అభి + ఆర్ధి = అభ్యర్ధి 

పైన అంశాలు గమనించగా గుర్వాజ్ఞ అనేది యణాదేశ సంధి అని మనం చెప్పవచ్చు.

Telugu Question 9:

'నాది బడి పలుకుల భాష కాదు......పలుకుబడుల భాష' అని అన్నది ఎవరు?

  1. బాలగంగాధర్ తిలక్

  2. దాశరథి కృష్ణమాచార్యులు

  3. శ్రీరంగం శ్రీనివాసరావు

  4. కాళోజి

Answer (Detailed Solution Below)

Option 4 : కాళోజి

Telugu Question 9 Detailed Solution

సరైన సమాధానం : "కాళోజి"

కీలక అంశాలు:

  • ఎంపికలలో ఉన్న వ్యక్తుల గురించి చర్చిద్దాం.
  • దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అభ్యుదయ, భావకవిత్వాలకు వారధి లాంటివాడు. ఎక్కువగా రాసింది కథలే అయినా, 'అమృతం కురిసిన రాత్రి' అనే కవితా సంపుటి పేరు తెచ్చిపెట్టింది.
    • 'దేవుడా! రక్షించు నాదేశాన్ని, పవిత్రులనుండి, పతివ్రతలనుండి, పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి...' అని అన్నది  – తిలక్
    • 'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' – తిలక్
  • దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987)
    • బిరుదులు: కవి సింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి,
    • విశేషం: ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు.
    • కవితా సంపుటాలు: అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమంజరి, దాశరథీ శతకం, మహాబోధి, తిమిరంతో సమరం, అలోచనాలోచనలు
    • అనువాదం: గాలిబ్ గీతాలు
    • స్వీయ చరిత్ర: యాత్రా స్మృతి
    • అవార్డులు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (కవితాపుష్పకం), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తిమిరంతో సమరం), ఏపీ ఉత్తమ అనువాద బహుమతి (గాలిబ్ గీతాలు), ఆంధ్రా విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది.
    • ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న అభ్యుదయ కవి దాశరథి. నిజాంకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి... అక్కడ నుంచే తన కవిత్వం ద్వారా పోరాటాన్ని కొనసాగించిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు.
    •  ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునక గ్గి పెట్టెద’ అని ఆయన నినదించారు.
    •  ‘ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ’ అని అంటూ దాశరథి పుట్టిన ప్రాంతంపై మమకారాన్ని చాటుకోవటంతో పాటు రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకు అంకితమిచ్చారు.
    • ‘అనాదిగా సాగుతోంది-అనంత సంగ్రామం అనాథునికీ ఆగర్భ శ్రీమంతునికీ మధ్య’ అంటూ తనలోని సామ్యవాద ఆలోచనలను దాశరథి వ్యక్తీకరించారు.
  • శ్రీరంగం శ్రీనివాసరావు: అభ్యుదయ ఉద్యమానికి మూలవిరాట్టు శ్రీశ్రీ.
    • ఈ శతాబ్దం నాది అని పలికిన శ్రీశ్రీ తొలి రచన ప్రభవ అనే పద్యకావ్యం. మహాప్రస్థానం ఈయన ప్రతిభకు దర్పణం. మరో ప్రస్థానం విప్లవ కావ్యం. సిరిసిరిమువ్వ అనే శతకం రాశారు. శ్రీశ్రీ స్వీయ చరిత్ర 'అనంతం'.
    • 'నేను సైతం ప్రపంచాగ్నికి, సమిధనొక్కటి ఆహుతిచ్చాను' – శ్రీశ్రీ
  • కాళోజీ: నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు అసలు పేరు  రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు.
    • ఇతని జన్మదినాన్ని(సెప్టెంబరు 9, 1914) తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది.
    • ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
    • ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ ప్రకటించాడు.
    • ‘ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక’ - కాళోజి
    • ‘పుటుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది..’ అంటూ.. వందేళ్ల కిందట పుట్టి వెయ్యేళ్లకు సరిపడా మెదళ్లను కదలించిన ఈ శతాబ్దపు మేటి కవి మన కాళన్న.
    • భాష రెండు తీర్లు – ఒకటి  బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష, పలుకు బడుల భాష గావాలె. అని అన్నాడు మన  కాళోజీ.
  • కావున ఇచ్చిన ఎంపికలని గమనించగా ‘కాళోజి’ సరైన సమాధానం అవుతుంది. 

Telugu Question 10:

'వెచ్చని' పదం ఈ గణానికి చెందింది.

  1. నగణము 
  2. సగణము
  3. జగణము
  4. భగణము

Answer (Detailed Solution Below)

Option 4 : భగణము

Telugu Question 10 Detailed Solution

దీనికి సరైన సమాధానం భగణము అవుతుంది. 

Key Points

  •  పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు.
  • ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. గురువుని U తోటి, లఘువుని l తోటి సూచిస్తారు
  • ఆది గురువు భ గణము UII
    మధ్య గురువు జ గణము IUI
    అంత్య గురువు స గణము IIU
    సర్వ లఘువులు న గణము III
    ఆది లఘువు య గణము IUU
    మధ్య లఘువు ర గణము UIU
    అంత్య లఘువు త గణము UUI
    సర్వ గురువులు మ గణము UUU
  • ఇవి మూడక్షరముల గణములు
  • వెచ్చని= IUI= జ గణము
  • కనుక 'వెచ్చని' పదం భగణము అనే  గణానికి చెందింది అని చెప్పవచ్చు. 
Get Free Access Now
Hot Links: teen patti wala game teen patti sweet teen patti joy teen patti vungo